ధనుర్మాసంలో వినవచ్చే “తిరుప్పావై – సప్తపది” రేడియో ప్రసారంలో శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన తెలుగు పద్యాలను రచించినది ఎవరు అన్నది తెలియరాలేదు. తిరుప్పావై పుస్తకాలు చాలా చూసినా ఆ పద్యాలు మటుకు దొరకలేదు. చివరకు టి. టి. డి. వారి సప్తగిరి 1987 నాటి మాసపత్రికలలో రాసిన వారి వివరాలు, ఆ పద్యాల సాహిత్యం, వాటి తాలూకు చక్కటి చిత్రాలు
లభించాయి. ఈ పద్యాలలో మొదటి పది పద్యాలు శ్రీనివాస గురుడు అనే ఆయన , చివరి ఇరవై
పద్యాలు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
తెనిగించినట్లు తెలుస్తోంది. అయితే 5,6,25,26,27,28,29,30 పాశురములకు సాహిత్యం, 29,30 పాశురములకు చిత్రాలు లభించలేదు. శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన 1,2,3,4 పాశురములకు సంబంధించిన పద్యాలు వింటూ ఆ వివరాలేమిటో చూద్దాము.
ఈ తిరుప్పావై – సప్తపది
ఆడియో సి.డి.లు ఆకాశవాణి వారి వద్ద లభిస్తాయి.
Tags: Thiruppavai, Sapthapadi, Srirangam Gopalarathnam,
























































