Thursday, December 7, 2017

ఆంధ్ర విశ్వకళాపరిషత్

ఆంధ్ర యూనివర్శిటి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరగబోతున్న తరుణంలో, ఒక్కసారి అలా గతంలోకి వెళితే, మొదట ఈ విశ్వవిద్యాలయమును బెజవాడలో 1926లో నెలకొల్పారు. అయితే ఈ విశ్వవిద్యాలయమును గుంటూరులో పెట్టాలని, కాదు బెజవాడలో పెట్టాలని చాలా వాడివేడి చర్చ జరిగింది. దీనిగురించి అనేక వ్యాసాలు నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 1926 నాటికే అటు గుంటూరులో అరండల్ పేట, బ్రాడీపేట ఇటు బెజవాడలో గవర్నరుపేట, గాంధీనగర్ ఏర్పడ్డాయి. నాటి బెజవాడ జనాభా యాభైవేలు. బెజవాడ పురపాలక సంఘం వారు 100 ఎకరాలు 2 లక్షలకు కొని విశ్వవిద్యాలయమునకు ఇచ్చుటకు తీర్మానంగూడ చేశారు. చిలుకూరి నారాయణరావు గారు విశ్వవిద్యాలయములో తెనుగును ప్రధాన భాషగా చేయాలని ప్రసంగాలు చేశారు. కట్టమంచివారు విశ్వవిద్యాలయమునకు మొదటి ఉపకులపతిగా తదుపరి సర్వేపల్లి వారు పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయము చిహ్నమును ప్రముఖ చిత్రకారులు శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారు (1906-1976) శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి సూచనమేరకు చిత్రీకరించారు. ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ సూరి భగవంతంగారు కట్టమంచి వారి కోరికమేరకు ఈ విశ్వవిద్యాలయ కళాశాలలో పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో విశ్వవిద్యాలయమును గుంటూరుకు తరలించారు. ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఈ విశ్వవిద్యాలయమునకు సేవలు అందించారు, అలాగే ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. “కళాప్రపూర్ణ” బిరుదంతో ఈ విశ్వవిద్యాలయము ఎంతోమంది ప్రముఖులను సన్మానించింది. 





Source: The Hindu









part of the article - Andhra Parika 22nd May 1926




















Tags: Andhra University

No comments:

Post a Comment